నిజామాబాద్‌లో దారుణం.. అల్లుడు మిస్.. వియ్యంకుడి దారుణ హత్య!

-

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురుయ్యాడు. ఈ ఘటన జిల్లాలోని మోపాల్ మండల పరిధి కంజర గ్రామంలో గురువారం ఉదయం వెలుగుచూసింది.పోలీసుల కథనం ప్రకారం.. కంజర గ్రామానికి చెందిన గోవర్ధన్, భవిత దంపతులు. ఇటీవలే కుటుంబ కలహాల నేపథ్యంలో భవిత ఆత్మహత్య చేసుకుంది.

అయితే, తన కూతురుని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని తండ్రి సత్యనారాయణ కన్నీరుమున్నీరయ్యాడు. ఈ క్రమంలోనే అల్లుడు గోవర్ధన్‌పై కోపం పెంచుకున్నాడు. తన కూతురు ఆత్మహత్యకు అతడే కారణమని ద్వేషం పెంచుకున్నాడు. గురువారం ఉదయం సత్యనారాయణ తన కూతురు అత్తగారింటిపైకి దాడి చేసేందుకు వెళ్లాడు. అక్కడ అల్లుడు గోవర్ధన్ లేకపోవడంతో అడ్డుకునేందుకు వచ్చిన అతని తండ్రి నరహరిని కత్తితో నరికి చంపేశాడు.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యా జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడు సత్యనారాయణ కోసం గాలిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version