సంగారెడ్డిలో హైడ్రా యాక్షన్.. హోంగార్డుకు తృటిలో తప్పిన ప్రమాదం!

-

అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో హైడ్రా తన దూకుడును కొనసాగిస్తునే ఉన్నది.తాజాగా ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేశారు.డిటొనేటర్లను వాడి ఆ భవంతిని కూల్చేశారు.సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కుతుబ్‌షాయిపేట మల్కాపూర్ పెట్ట చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై ఇటీవల హైడ్రా ఫోకస్ పెట్టింది.

కొండాపూర్ మండల రెవెన్యూ,ఇరిగేషన్ అధికారుల నివేదిక ఆధారంగా కలెక్టర్‌ ఆ కట్టడాన్ని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో గురువారం ఉదయం భారీ బందోబస్తు మధ్య తహసీల్దార్ అనిత, ఇతర అధికారులు ఆ భవనాన్ని నేలమట్టం చేశారు. అయితే, ఆ భవంతి నేలమట్టం అయ్యే సమయంలో రాయి తగిలి అక్కడే ఉన్న హోంగార్డు గోపాల్ తలకు గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఆక్రమణల విషయంలో కఠినంగా ఉంటామని హైడ్రా అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version