ఏపీలో దారుణం.. కత్తులతో బెదిరించి అత్తాకోడళ్లపై సామూహిత అత్యాచారం

-

ఏపీలోని సత్యసాయి జిల్లాలో అతి దారుణ ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి అత్తా కోడళ్లపై సామూహిత అత్యాచారం జరిగింది. వాచ్‌మెన్‌, అతని కొడుకును కత్తులతో బెదిరించి అత్తా కోడళ్లపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. వీరిద్దరితో పాటు మరో ఐదుగురు గుర్తు తెలియని దుండగులు కూడా వారిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దారుణమైన ఘటన చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో వెలుగుచూసింది.

సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత మహిళలు ఉపాధి కోసం ఇటీవలే బళ్లారి నుంచి ఏపీలోని సత్యాసాయి జిల్లాలకు వచ్చినట్లు గుర్తించారు. వీరు స్థానికంగా ఉండే ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. అత్తాకోడళ్లు ఇద్దరు ఒంటరిగా ఉండటాన్ని గతకొన్ని రోజులుగా గమనించిన దుండగులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news