బాలానగర్ లో దారుణం.. రూ. 400 కోసం హత్య

-

హైదరాబాద్ నగరంలోని బాలానగర్లో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. 400 రూపాయల కోసం హత్య జరిగింది. శ్రీనివాస్ అనే వ్యక్తిని కాశీరాం అనే వ్యక్తి 400 రూపాయల కోసం దారుణంగా హత్య చేశాడు. బాలానగర్ లో కాశీరాం, శ్రీనివాస్ అనే ఇద్దరు కూలీలుగా పనిచేస్తున్నారు. ఆదివారం వీరిద్దరి మధ్య డబ్బుల కోసం వాగ్వాదం జరిగింది.

నర్సాపూర్ చౌరస్తా రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ పై ఇద్దరు గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో తీవ్ర అగ్రహానికి గురైన కాశీరాం శ్రీనివాసుని కర్రతో కొట్టి విచక్షణా రాహిత్యంగా దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అటుగా వెళుతున్న లారీ కిందకు తోసేసాడు. లారీ కింద పడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news