దారుణం; సహాయం కోసం అని పిలిచి కదిలే కార్ లో రేప్…!

-

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. భోపాల్ శివార్లలో కదిలే కారులో ఇద్దరు పిల్లల తల్లిని అపహరించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు 12 గంటల తర్వాత మహిళను వారు విడిచిపెట్టారు. అయితే ఆమెను నేరస్తులు బెదిరించడంతో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడానికి భయపడ్డారట. వివరాల్లోకి వెళితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే,

భోపాల్‌లోని కరోండ్ ప్రాంతంలో నివసిస్తున్న బాధితురాలు కోలార్ ప్రాంతంలోని జెకె ఆసుపత్రికి వెళుతుండగా, ఆమెకు ఉన్నట్టుండి ఫోన్ వచ్చింది. ఆస్పత్రిలో సహాయం అందించాలని, చెప్పగానే ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్ళకుండా రైసన్‌ అనే ప్రాంతానికి తీసుకువెళ్ళారు. కారుని మలుపులు తిప్పుతూ రైసెన్ వెళ్లే మార్గంలో ఇద్దరు మిత్రులు మద్యం సేవించి బాధితురాలిపై అత్యాచారం చేసారు.

నిందితుల్లో ఒకరు, జావేద్‌గా గుర్తించారు. అతనితో పాటుగా అతని స్నేహితుడు కూడా ఈ ఘోరానికి పాల్పడినట్టు గుర్తించారు. తన భర్త నుంచి తను దూరమైన తర్వాత కుమార్తెలతో కలిసి కరోండ్ ప్రాంతంలో నివసిస్తున్నా అని పోలీసులకు తెలిపింది. సుమారు ఆరు నెలల క్రితం, తనకు తెలియని నంబర్ నుండి కాల్ వచ్చిందని, కాల్ చేసిన వ్యక్తి తనను తాను జావేద్ అని పరిచయం చేశాడని ఆమె పేర్కొంది.

కాల్ చేసిన వ్యక్తి తరువాత బాధితురాలితో వాట్సాప్‌లో చాటింగ్ కూడా చేసినట్టు పోలీసులు గుర్తించారు. అప్పుడు ఆమె తనను వివాహం చేసుకోవాలని కూడా అడగగా ఆమె తిరస్కరించింది. అయితే ఇంత వరకు ఎవరినీ పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. ప్రస్తుతం రెండో నిందితుడుని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news