బ్రేకింగ్ : బండి సంజయ్ పై దాడికి యత్నం

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై స్వేరోస్ ప్రవీణ్ కుమార్ అనుచరులు దాడికి యత్నించిన ఘటన సంచలనంగా మారింది. హుజర్నగర్ లో గిరిజనుల భూముల కోసం పోరాడడం తో ప్రభుత్వం కొందరు బీజేపీ నేతల మీద కేసులు పెట్టండి. దీంతో  38 రోజుల పాటు జైల్లో ఉన్న బీజేపీ, బీజేవైఎం నాయకులు ఈ రోజు బెయిల్ పై రావడంతో వారి దగ్గరికి వెళ్లిన బండి సంజయ్ కలిసి వచ్చారు.

వస్తున్న క్రమంలో బండి కాన్వాయ్ ని అడ్డుకున్న స్వేరోస్ ప్రతినిధులు దాడికి ప్రయత్నించారు. ఇనుప రాడ్లతో వచ్చిన స్వేరోస్ ప్రతినిధులు, ప్రవీణ్ కుమార్ అనుచరులను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఘటనా స్థలం నుంచి బండి సంజయ్ ని సేఫ్ గా బీజేపీ కార్యకర్తలు తప్పించారు. ఇక ఇనుప రాడ్లతో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ని కార్ ను ప్రవీణ్ కుమార్ అనుచరులు, స్వేరోస్ ప్రతినిధులు ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version