కామన్వెల్త్ క్రికెట్‌లో టీమిండియాకు రజతం.. పోరాడి ఓడిన అమ్మాయిలు

-

కామన్ వెల్త్ గేమ్స్ లో ఈసారి ప్రవేశపెట్టిన మహిళల t20 క్రికెట్ లో టీమిండియా జట్టు రజత పతకంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ లో హార్మన్ ప్రీత్ కౌర్ బృందం 9 పరుగులు తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ముందుగా ఆస్ట్రేలియా 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

ఓపెనర్‌ బెత్‌ మూనీ, మెగ్‌ లానింగ్‌, ఆష్లే గార్డెనెర్‌ రాణించారు. భారత బౌలర్లలో రేణుక సింగ్‌, స్నేహ్‌ రాణా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత మహిళల జట్టు 19.3 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్‌ అయి.. ఓటమి చవిచూసింది. హర్మన్‌ ప్రీత్ కౌర్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడినా ఫలితం లేకపోయింది. దీంతో టీమిండియ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news