కాళేశ్వరం ప్రాజెక్ట్ కన్నా.. బాహుబలి సెట్టింగే బలంగా ఉంది: కామారెడ్డి ఎమ్మెల్యే

-

బీఆర్ఎస్ పై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి కొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడో సారి మోడీ సర్కార్ నినాదంతో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేస్తుంది.ఇందులో భాగంగా ఆదివారం రాత్రి ఖమ్మం లోక్ సభ స్థానంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ….గతంలో అధికారంలో ఉన్న కేసిఆర్ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని.. వారి అవినీతికి అంతులేకుండా పోయిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజేక్ట్ కంటే.. సినిమా కోసం తాత్కలికంగా వేసిన బాహుబలి సెట్… ఇప్పటికీ బలంగా ఉందని ఆయన మండిపడ్డారు.

అలాగే ఖమ్మంలో ఒక్కసారి కూడా బీజేపీ గెలవనప్పటికీ కూడా కేంద్రంలోని బీజేపీ..8 వేల కోట్లతో నేషనల్ హైవే నిర్మించిందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లా వైరల్ గా మారింది.గతేడాధి తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ,రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ సీఎం కేసీఆర్ తో పాటు రేవంత్ రెడ్డి లను ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news