గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేది ప్రకటించిన TSPSC

-

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీపై TSPSC ప్రకటన చేసింది. జూన్ 9వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో కొత్తగా 60 పోస్టులను కలిపి 563 పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 14 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని TSPSC సూచించింది. కొత్త అభ్యర్థులతో పాటు గత నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్నవారు కూడా మళ్లీ అప్లై చేసుకోవాల్సి ఉంటుందని TSPSC పేర్కొంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు కల్పించింది.

 

కాగా…..2022 ఏప్రిల్ లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.అయితే పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడితే.. మరొకసారి నిబంధనలు సరిగ్గా పాటించలేదని రెండోసారి కూడా ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news