కెప్టెన్ గా హనుమ విహారే ఉండాలి : ఆంధ్ర రంజీ ప్లేయర్స్

-

ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట ఉండలేనంటూ భవిష్యత్తులో ఆంధ్రా క్రికెట్ జట్టుకు ఆడబోనని సీనియర్ క్రికెటర్ హనుమ విహారి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఆంధ్ర రంజీ క్రికెట్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రికెట్లో రాజకీయ నేత జోక్యం విషయంలో హనుమ విహారికి తోటి ప్లేయర్లు మద్దతుగా నిలిచారు. తమకు హనుమ విహారే కెప్టెన్గా కావాలంటూ రికీ భుయ్ సహా ఆంధ్ర రంజీ ఆటగాళ్లందరూ తమ సంతకాలతో కూడిన లేఖను ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి, సీఈవోకు అందజేశారు. జట్టులోని ఓ ప్లేయర్ పట్ల హనుమ విహారి దురుసుగా ప్రవర్తించాడన్నది అవాస్తవమని వారు లేఖలో పేర్కొన్నారు.

విహారి పోస్టు వైరల్‌ అయిన తర్వాత పృథ్వీరాజ్‌ ఇన్‌స్టా వేదికగా స్పందిస్తూ.. ‘అందరికీ హలో.. మీరు కామెంట్‌ బాక్స్‌లలో వెతుకుతున్న క్రికెటర్ నేనే. అతడు చెప్పింది అబద్ధం. నాపై అసభ్య పదజాలం సరికాదు అని అన్నాడు. నువ్వు ఇంతకు మించి ఏం పీకలేవు మిస్టర్ సో కాల్డ్ ఛాంపియన్’ అని ఇన్స్టాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news