ఇదేంది బాలయ్య…కథ చెప్పి..అన్నగారి పరువు తీసినవ్..

-

ఏపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ  శనివారం రాత్రి సనత్ నగర్, ముషీరాబాద్‌లలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ… కేసీఆర్ ప్రభుత్వాన్ని భల్లాలదేవుడి రాజ్యంతో పోలుస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ‘బాహుబలి’ అంటూ  పొగడ్తలతో ముంచెత్తుతూ..  ‘బాహుబలి’ కథ చెప్పారు. మహిష్మతి రాజ్యానికి భల్లాలదేవుడు రాజైతే అయ్యాడు. కానీ, అక్కడి ప్రజల కళ్లలో నిలిచిపోయింది మాత్రం బాహుబలే. అలాగే తెలంగాణలో కూడా కేటీఆర్ ప్రభుత్వం నడుస్తున్నా.. ప్రజల గుండెల్లో మాత్రం చంద్రబాబు నాయుడే ఉన్నారు’’ వివరించారు.

దీంతో ఆసక్తిగా కథ వింటున్న వారు…చీ బాలయ్య మారడు.. అన్న..ఎన్టీఆర్ పరువు తీశారు..చంద్రబాబుని మరింత పూసుకోవడం సరికాదంటూ వెళ్లిపోయారు. కొంత మంది నేతలు.. ‘‘కన్నతల్లి పాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా.. తలసాని తెదేపా నుంచి గెలిచి తెరాసలో  చేరాడు..అలాంటి వారికి బుద్ది చెప్పండి అంటూ తన ప్రసంగం చేశారు. ఈ మీటింగ్ ని ఆన్ లైన్ లో ఫాలో అవుతున్న వారు..‘‘ అక్కడ బాబు చేస్తే న్యాయం ఇక్కడ కేసీఆర్ చేస్తే అన్యాయమా?’’ బాలయ్య గారు ఇక మీరు చెప్పింది చాలు.. అంటూ కామెంట్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version