ఓటీటీ లోకి బాలయ్య… హోస్ట్ గా రచ్చ రచ్చే..?

-

నటసింహం నందమూరి బాలయ్య త్వరలో ఓటీటీ లోకి అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. బాలయ్య త్వరలో ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నరట. అయితే బాలయ్య ఓటీటీ లో అడుగుపెడుతోంది సినిమా తోనో లేదంటే వెబ్ సిరీస్ తోనో కాదు. ఎవరూ ఊహించని విధంగా బాలయ్య హోస్ట్ గా చేయబోతున్నట్టు ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అంతే కాకుండా ఇటీవల బాలయ్య ఛార్మీ, పూరీ జగన్నాథ్ లతో కలిసి దిగిన ఫోటో కూడా బాలయ్య టాక్ షో కోసమే అని కూడా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుండి బాలయ్య ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇక ఇప్పటి వరకు బాలయ్య సినిమాలతో అభిమానులను అలరించగా హోస్ట్ గా ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news