కర్ణాటక ఎన్నికల కోసం కాంగ్రెస్‌ కు సీఎం కేసీఆర్‌ ఫండ్‌ ఇచ్చాడు – బండి సంజయ్‌

-

కర్ణాటక ఎన్నికల కోసం కాంగ్రెస్‌ కు సీఎం కేసీఆర్‌ ఫండ్‌ ఇచ్చాడని సంచలన ఆరోపణలు చేశాడు తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్‌. తెలంగాణ లో కేంద్రం సంక్షేమ కార్యక్రమాలను నీరుగారుస్తున్నారని.. కేంద్రంలో, యుపిలో బిజెపి సర్కార్ లు ఉన్నాయి కాబట్టి అక్కడ పథకాలు బాగా అమలు అవుతున్నాయని వివరించారు.

అయుష్మన్ భారత్ నిధులను దారి మళ్ళిస్తుంది కేసీఅర్ సర్కార్ అని ఫైర్‌ అయ్యారు. తెలంగాణ లో మిషన్ భగీరథ పెద్ద స్కాం ..ఆ స్కీమ్ ఇప్పటికీ సరిగ్గా అమలు కావడం లేదని వివరించారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే స్కీమ్ లు బాగా అమలు అవుతాయని.. కేంద్రం కు ,మోడీ కి మంచి పేరు వస్తుందని స్కీమ్ లను కేసీఅర్ అమలు చేయడం లేదని నిప్పులు చెరిగారు. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ నాయకులు ఫోన్లు ఎత్తలేదు…కాంగ్రెస్ కు ఫండ్ ఇచ్చారని కేసీఆర్ పై ఆరోపణలు చేశారు బండి సంజయ్‌.
కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి కేసీఆర్ ఫండింగ్ చేశారు.. తెలంగాణ లో కాంగ్రెస్ ఏ విధంగా ప్రత్యామ్నాయం అవుతుంది ? తెలంగాణలో ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version