గవర్నర్ నోటితో అసత్యాలు చెప్పించడం సిగ్గు చేటు – బండి సంజయ్

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్… కేసీఆర్ సర్కార్‌ పై ఫైర్‌ అయ్యారు. గవర్నర్ నోటితో అసత్యాలు చెప్పించడం సిగ్గు చేటన్నారు బండి సంజయ్. ఇన్నాళ్లు గవర్నర్ గారిని, రాజ్యాంగాన్ని అవమానపర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు రాష్ట్ర ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారి నోటితో అసత్యాలు చెప్పించడం బాధాకరం. విఫలమైన పథకాలను గవర్నర్ గారి ప్రసంగంలో గొప్పవిగా చూపుతూ ప్రజలను మభ్యపెట్టే యత్నం చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. విద్య, వైద్య వ్యవస్థ కునారిల్లుతోంది. నిండా అవినీతిలో కూరుకుపోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రాష్ట్ర ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు గవర్నర్ గారి నోటితో అబద్దాలు చదివించడం దుర్మార్గం. ముఖ్యంగా రైతులకు త్రీ ఫేజ్ కరెంట్ ను 24 గంటలపాటు సరఫరా చేశామనడం పచ్చి అబద్దం. వ్యవసాయానికి 24 గంటలపాటు కరెంట్ సరఫరా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్దమని నేను గతంలోనే సవాల్ చేసినా స్పందించని ముఖ్యమంత్రి ఈరోజు గవర్నర్ నోటితో కూడా అబద్దం చెప్పించడం బాధాకరమని తెలిపారు. రాష్ట్రంలో రూ.లక్ష కోట్లు వెచ్చించి కాళేశ్వరం నిర్మించినా ఆయకట్టు ఏమాత్రం పెరగనప్పటికీ 73.33 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం పెరిగిందని పేర్కొనడం దుర్మార్గమని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news