తెలంగాణ ఒక వ్యక్తి కుటుంబం చేతిలో బందీ అయింది: కోదండరాం

-

అనేక పోరాటాల ఫలితంగా తెలంగాణను సాధించుకున్నట్లు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నాంపల్లి లోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “తెలంగాణ ప్రజలు చాలా ఉద్యమాలు చేశారు. తెలంగాణ ఒక వ్యక్తి వల్ల వచ్చింది కాదు. అనేకమంది సుదీర్ఘ పోరాటాలు, ఉద్యమాల ఫలితంగానే రాష్ట్రం అవతరించింది.

kodandaram tjs – Telangana Janasamithi

తెలంగాణ కోసం చాలా మంది యువకులు బలిదానాలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు నిరంకుశ పాలన నడుస్తోంది. ఒక వ్యక్తి కుటుంబం చేతిలో బందీ అయింది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ఉద్యమాలు చేస్తాం. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోరుకుంటున్నారు. ఉద్యమకారులు ఒక తాటి పైకి రావాలి. 6వ తేదీన ఇందిరాపార్కు వద్ద ఆత్మగౌరవ దీక్ష చేపట్టబోతున్నాము. ఇందులో ఉద్యమకారులు అందరూ పాల్గొనాలి.” అని కోదండరాం కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version