బీజేపీ అధిష్టానానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బండి సంజయ్ … !

-

ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను తొలగించి ఆ స్థానంలో ఎంపీ కిషన్ రెడ్డిని నియమించింది. ఆ తర్వాత కొద్దీ రోజులకు బండి సంజయ్ ను తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సందర్భంగా బండి సంజయ్ అధిష్టానానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేశాడు.. బండి మాట్లాడుతూ… నా లాంటి సామాన్య కార్యకర్తకు బీజేపీ జాతీయ ప్రార్ధనా కార్యదర్శి పదవిని ఇచ్చినందుకు చాల గర్వంగా ఉందన్నారు. నాపై నా సమర్ధతపై నమ్మకముంచిన బీజేపీకి జీవితాంతం రుణపడి ఉంటానని ఎమోషనల్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరియు కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా లకు థాంక్స్ చెప్పాడు.

నేను ఒక కార్యకర్త నుండి ఈ స్థాయికి రావడానికి కారణమైన ప్రతి ఒక్క నేతకు, మరియు కరీంనగర్ కార్యకర్తలకు మరియు ప్రజలకు థాంక్స్ చెప్పాడు. ఎప్పుడూ మీ సేవలో ఉంటునని మాటిచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version