ఈరోజు మధ్యాహ్నం గిర్ని తండాకు బండి సంజయ్

-

జనగామ జిల్లా కడకండ్ల మండలంలోని గిర్ని తండాకు వెళ్ళనున్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జనగాం జిల్లా కొడగండ్ల మండలం గిర్ని తండాకు చేరుకుంటారు బండి సంజయ్. అక్కడ గిరిజన భూ పోరాట యోధుడు జాఠోత్ ఠానూ నాయక్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడతారు.

ఇక సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి (తొండ)కు చేరుకుంటారు. అక్కడ స్థానిక నేతలను కలుస్తారు. అనంతరం అక్కడి నుండి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు వరంగల్ కు చేరుకుంటారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా వరంగల్ పోచమ్మ మైదాన్ నుండి కాకతీయ మెడికల్ కాలేజీ వరకు నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version