గ్లోబల్ సమ్మేట్ ఓ బూటకం – నాదెండ్ల మనోహర్

-

గ్లోబల్ సమ్మేట్ ఓ బూటకం అన్నారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబల్ సమ్మెట్ బూటకం అని, అంకెల గారడీతో ప్రజలను వైసిపి ప్రభుత్వం మోసం చేస్తోందని దుయ్యబట్టారు. సీ పూడ్స్ ఎగుమతుల్లో భారతదేశంలోనే ఏపి అగ్రస్థానంలో ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కోడిగుడ్డును సీపూడ్స్ లో కలిపి చూపడంతో మంత్రులు ఎంత అవివేకంతో ఉన్నారో చెప్పడానికి ఉదాహరణ అంటూ ఎద్దేవా చేశారు. ఇన్వెస్టర్లను తప్పు పట్టడంలేదని.. వైసిపి తప్పుడు ప్రచారం చేయడాన్నే ఖండిస్తున్నామన్నారు. గ్లోబల్ సమ్మెట్ పేరుతో 170 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయిందన్నారు నాదెండ్ల మనోహర్. చిత్తశుద్ధితో చేస్తే మెరుగైన పెట్టుబడులు వస్తాయన్నారు. ఇందుకు జనసేన పార్టీ సపోర్టు చేస్తుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version