BREAKING : హై కోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్

-

తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ్. జనవరి 20 న భగీరధ్ ను సస్పెండ్ చేసింది మహేంద్ర యూనివర్సిటీ. అయితే… తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ సస్పెండ్ చేసిందని కోర్టు కు తెలిపారు భగీరధ్. ఇంటర్నల్ పరీక్షలు రాసేలా అనుమతి ఇవ్వాలని కోర్టు ను కోరారు భగీరధ్.

ఈ పిటిషన్ ను విచారించిన హై కోర్టు… భగీరధ్ సస్పెన్షన్ పై హై కోర్టు స్టే విధించింది. పరీక్షకు రాసేందుకు అనుమతి ఇవ్వాలని మహేంద్ర యూనివర్సిటీ కు హై కోర్టు ఆదేశించింది. మార్చ్ 9న హై కోర్టు ఉత్తర్వులు జారీ చేయగా…హై కోర్ట్ అదేశలతో పరీక్షలు రాశారు బండి భగీరద్. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భగీరధ్ ను క్లాస్ లోకి అనుమతించాలని యూనివర్సిటీ కు హై కోర్టు తాజాగా ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version