నేటి నుంచే బతుకమ్మ చీరెల పంపిణీ..

-

తెలంగాణ‌లోని ఆడ‌ప‌డుచుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌తుక‌మ్మ కానుక అందించ‌నున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మ‌హిళ‌ల‌కు ప్రభుత్వం అందించే చీరల పంపిణీ కార్య‌క్ర‌మం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నది. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ఈ సారి బ‌తుక‌మ్మ పండుగ‌కు మ‌హిళ‌ల‌కు చీరెల పంపిణీ ఉండ‌ద‌ని తొలుత భావించిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం మాత్రం ఈ కార్య‌క్ర‌మాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే సంక‌ల్పించింది.

మొత్తం 287 డిజైన్లలో, విభిన్న రంగుల్లో తయారు చేసిన కోటి చీరెలను ప్ర‌భుత్వం ఇప్పటికే ఆయా జిల్లాలకు పంపింది. వీటి కోసం రూ.317 కోట్లను ప్రభుత్వం వెచ్చింది. తెల్ల రేష‌న్‌కార్డు ఉండి, 18 ఏండ్లు నిండిన మహిళలకు ఈ చీర‌ల‌ను పంపిణీ చేయ‌నున్నారు. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చీరెలను పంపిణీ చేయ‌నున్నారు. స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేయడమా లేక ఒకేచోట భౌతిక దూరం పాటిస్తూ వాటిని అందించాలా అన్నదానిపై జిల్లా కలెక్టర్లకు అధికారం ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే మొత్తంగా బతుకమ్మ చీరెల పంపిణీ కోసం గత నాలుగేండ్లలో ప్రభుత్వం రూ.1,033 కోట్లు ఖర్చు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news