ఇక ఉమెన్స్ ఐపీఎల్..ఖరారు చేసిన బీసీసీఐ…!

-

ఈ ఏడాది ఐపీఎల్‌ ఫ్యాన్స్‌కి కిక్‌ ఇస్తోంది. సూపర్‌ ఫైటింగ్‌ మ్యాచ్‌లతో ఫ్యాన్స్‌ థ్రిలవుతున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్‌కు మరో గుడ్‌ న్యూస్‌. మహిళలు కూడా ధనాధన్‌ క్రికెట్‌ ఆడటానికి రెడీ అయ్యారు. ఉమెన్స్‌ ఆడే మినీ ఐపీఎల్‌ కోసం బీసీసీఐ చకాచకా ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్‌ 4నుంచి జరిగే ఈ మినీ ఐపీఎల్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ.

ఈ మినీ ఐపీఎల్‌ డేట్స్‌ను ఖరారు చేసింది బీసీసీఐ. నవంబరు 4 నుంచి 9 వరకు యూఏఈలో మహిళల టీ20 చాలెంజ్‌ టోర్నీ జరగనుంది. ప్రతీ ఏటా ఐపీఎల్‌ మధ్యలో మూడు జట్లతో కూడిన ఈ టోర్నీని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ టోర్నీని షార్జా వేదికగా నిర్వహించబోతున్నారు. మూడు జట్లు తలపడే మినీ ఐపీఎల్‌లో పాల్గొనే భారత క్రికెటర్లందరూ ఈనెల 13న ముంబైకి రావాలని బోర్డు సమాచారం ఇచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి చేరుకున్న ప్లేయర్లు వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఆ తర్వాత అక్టోబర్‌ 22న యూఏఈకి బయల్దేరే అవకాశం ఉంది. మొత్తం 30 మంది క్రికెటర్లకు బీసీసీఐ పిలుపునిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news