మరోసారి మారిపోయిన టీమిండియా జెర్సీ..ఫోటోలు వైరల్

-

ఇండియా – శ్రీలంక జట్ల మధ్య జరగాల్సిన మూడు టి20 లు, 3 వన్డేల సిరీస్ ఇవాళ్టి నుండి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా తొలి టీ20 ఇవాళ ముంబైలోని వాంకడే వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. దీంతో టీం ఇండియా జట్టు మొత్తం మైదానానికి చేరుకుంది. ఇది ఇలా ఉండగా, భారత క్రికెట్ జట్టు ‘కిట్’ లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది.

ఇప్పటివరకు ఎంపిఎల్ స్పోర్ట్స్ ‘కిట్’ స్పాన్సర్ గా ఉండగా, ఇప్పుడు దాని స్థానంలో కేవల్ కిరణ్ క్లాతింగ్ లిమిటెడ్ వచ్చింది. ఎంపిఎల్ తో ఏడాది మార్చి వరకు బిసిసిఐ ఒప్పందం ఉన్న విషయం తెలిసిందే. అయితే తమ హక్కులను మరో సంస్థకు బదలాయించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎంపిఎల్ బోర్డును ఇటీవలే కోరింది. అందుకు మూడు నెలల స్వల్ప కాలానికి కేకేసిఎల్ సీన్ లోకి వచ్చింది. దాంతో శ్రీలంకతో సిరీస్ నుంచి కేకేసిఎల్ తమ పాపులర్ బ్రాండ్ ‘కిల్లర్ జీన్స్’ లోగోను టీమిండియా జెర్సీ లపై ప్రదర్శించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news