బేర్ గ్రిల్స్-మోడీ: ఆడుకుంటున్న నెటిజన్లు..

-

జంతుసంరక్షణ, పర్యావరణ మార్పు గురించి అవగాహన కల్పించేందుకు అని ప్రధాని మోడీ చేసిన షూట్ ఒకటి నెట్టింట నవ్వులు పూయిస్తున్నది. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే దీన్ని గమనించవచ్చు. బేర్ గ్రిల్స్ కలిసి మ్యాన్ వర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ చేశారు. ఇది ఆగస్టు 12న టెలికాస్ట్ అవబోతున్నది. దీని ప్రమోషన్ భాగంగా విడుదల చేసిన ప్రోమోను మాత్రం నెటిజన్లు ఆడుకుంటున్నారు. మోడీకి ఇప్పటికే షూటింగ్ కెమెరాల పిచ్చి ఎంత ఉందో అందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో మరో ప్రోగ్రామ్ ద్వారా షో చేయడం వల్ల నెటిజన్లు తీవ్రంగా మోడీని ట్రోల్ చేస్తున్నారు.

‘నిజమే అతి క్రూరమైన మృగాలతో గడిపే బేర్ మోడీతో ప్రోగ్రామ్ చేయడం ఆశ్చర్యమేమీ కాదు’ అంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. అత్యంత ప్రమాదకరమైన మృగాలతో బేర్ ఎపిసోడ్ చేయగలడని మరోసారి నిజమైంది అంటూ యూత్ వ్యంగ్యాస్ర్తాలు వేస్తున్నారు. ఏది దొరికితే అది తినే బేర్ మోడీతో ఏమి తినిపిస్తాడు. మోడీ ఏం తింటాడు అనే విధంగా ట్రోల్స్ చేస్తున్నారు. మరో వైపు ఈ ఎపిసోడ్ షూట్ జరిగినప్పుడే పుల్వామా దాడి జరిగిందనీ, ఆ దాడి గురించి పట్టించుకోకుండా మోడీ ఈ ప్రోగ్రామ్ షూట్ ఉన్నాడనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా విదేశీ టూర్లపై, ఫోటోలపై, షూటింగ్ మోజు పడే మన దేశ ప్రధాని మోడీని ఇలా నెటిజన్లు మరో సారి ఏసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news