బేగంపేట్‌ మెట్రో స్టేషన్ మూసివేత…

-

హైదరాబాద్ బేగంపేట మెట్రో స్టేషన్ ని మెట్రో అధికారులు మూసివేశారు. మెట్రో స్టేషన్ కి తాళం వేసినట్లు అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ బేగంపేట మెట్రో స్టేషన్‌ను మూసేశార‌ని తెలుస్తోంది. ప్రతి స్టేషన్ లోను ప్రయాణికుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడానికి మెట్రో టికెట్ పై బేగంపెట్ మెట్రో స్టేషన్ మూసివేశారని, అక్కడ రైలు ఆగదని ముద్రించారు. అయితే ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

దీంతో ప్రగతి భవన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను పెంచారు అధికారులు. భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. నిరసన కారులు స్టేషన్‌లోకి చొచ్చుకు రావచ్చనే అనుమానాలతో ముందస్తు జాగ్రత్తగా బేగంపేట మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. మరోవైపు ఇవాల్టీ నుంచి స్కూల్స్ , కాలేజీలు కూడా తెరుచుకోవడతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news