‘భైరవం’ మూవీ రిలీజ్ డేట్ లాక్

-

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ , నారా రోహిత్ కలయికలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘భైరవం’ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. చాలా కాలంగా విడుదలకు సిద్ధంగా ఉండి, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది.మంచు మనోజ్ స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. “ఈ సమ్మర్‌లో ‘భైరవం’తో ప్రేక్షకులు మంచి సినిమా అనుభూతి పొందుతారని ఆశిస్తున్నాము. మే 30న మీ ముందుకు వస్తున్నాం!” అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో చాలా కాలంగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి.

విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌ను ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు. ముగ్గురు హీరోలు కలిసి నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌లకు మంచి స్పందన లభించింది. ‘భైరవం’ విడుదల తేదీ ఖరారు కావడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ను మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. ఈ ముగ్గురు హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మే 30న థియేటర్లలో ‘భైరవం’ ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి..

 

 

Read more RELATED
Recommended to you

Latest news