వాటర్ బాటిల్ ధర కంటే తక్కువకే కరోనా వ్యాక్సిన్: భారత్​ బయోటెక్​

-

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎంతో నైపుణ్యం సాధించామని భారత్ బయోటెక్​ సీఎండీ కృష్ణ ఎల్లా అన్నారు. వాటర్ బాటిల్ ధర కంటే తక్కువ ధరలోనే వ్యాక్సిన్ తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైరస్ కొత్తది కావడం వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌పై జినోమ్‌ వ్యాలీలో జరిగిన చర్చ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన. అమెరికాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతో సహకరిస్తున్నాయని వెల్లడించారు. మేము మార్కెట్‌లో పోటీదారులం కావొచ్చని. కానీ మా అందరి పోరాటం కరోనాను జయించడంపైనే అని వ్యాఖ్యానించారు.భారత వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 70 శాతం వాటా 3 హైదరాబాద్‌ కంపెనీలదేనన్న అయినా ప్రపంచంలో ఏ వ్యాక్సిన్ కంపెనీ కంటే కూడా హైదరాబాద్‌ కంపెనీలు తక్కువ కాదని అన్నారు.

Carona vaccine
Carona vaccine

ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్‌ ఎండీ డాక్టర్‌ ఆనంద్‌ మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ అధిక ధరలో ఉంటే చాలా మందికి అందుబాటులో లేకుండా పోతుందన్నారు.బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా స్పెక్‌ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుని అనేక వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు. ఏ వ్యాక్సిన్‌ కూడా భద్రతను పణంగా పెట్టి ప్రయోగాలు చేయదన్నారు. వ్యాక్సిన్ల అన్నింటి లక్ష్యం కరోనా నుంచి రక్షణ కవచం అందించడమేనని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news