భవాని దీక్షాధారులకు ముఖ్య గమనిక 

-

భవాని దీక్ష వేసుకునే భక్తులకు ముఖ్య గమనిక. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారి దేవస్థానంలో శ్రీ శార్వరి నామ సంవత్సర భవానీ మండల దీక్షలు  ప్రారంభం కానున్నాయి. 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు  భవానీలకు మాలధారణ మండల దీక్షలు ప్రారంభం కానున్నాయి.  25వ తేదీ ఉదయం 8 గంటలకు భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి.  డిసెంబర్ నెలలో అర్ధమండల దీక్షలు  ప్రారంభం కానున్నాయి. 

డిసెంబర్ 17 నుండి 19  వరకు అర్ధమండల  మాల ధారణ దీక్షలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 29న సాయంత్రం  6 గంటలకు సత్యనారాయణపురం లోని శివరామ కృష్ణ క్షేత్రం నుంచి  కలిసి జ్యోతులు ప్రారంభం కానున్నాయి. మాలా విరమణ మహోత్సవం 05-01-2021 నుండి ది.09-01-2021 వరకు జరగనుంది. జనవరి 5వ తేదీ ఉదయం 6.50  నిమిషాలకు అగ్ని ప్రతిష్టాపన, ఇరుముడి, అగ్నిగుండాల ప్రారంభం కానున్నాయి. జనవరి 9వ తేదీన ఉదయం 11 గంటలకు మహా పూర్ణాహుతితో భవానీ దీక్షలు ముగియనున్నాయి. 

 

Read more RELATED
Recommended to you

Latest news