వసంతమ్మ ఫ్యామిలీకి భువనమ్మ ఆత్మీయ పరామర్శ

-

అవినీతి కేసులో అరెస్టయిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు గత నెలరోజులకు పైగా జైల్లోనే వుంటున్నాడు. టిడిపి అధికారంలో వుండగా స్కిల్ డెవలప్ మెంట్ పేరిట స్కాం జరిగిందని.. ఇందులో ప్రధాన పాత్ర ఆనాటి సీఎం చంద్రబాబుదే అని వైసిపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ మేరకు సిఐడితో స్కిల్ స్కాం పై విచారణ జరిపించి చంద్రబాబును అరెస్ట్ చేయించారు. దీంతో తండ్రి, భర్త ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాలంలోనే కాదు ఏనాడూ రాజకీయాల జోలికి రాని నారా భువనేశ్వరి ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో పార్టీని ముందుండి నడపాల్సి వస్తోంది.

భర్త చంద్రబాబు నాయుడి కోసం ఓవైపు పోరాటం చేస్తూనే మరోవైపు టిడిపిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు భువనేశ్వరి. తండ్రిని జైల్లోంచి బయటకు తీసుకువచ్చేందుకు లోకేష్ న్యాయపోరాటం చేస్తున్నాడు. దీంతో అత్తాకోడలు భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రజల్లోకి వెళుతూ చంద్రబాబు ఏ తప్పూ చేయకున్నా అరెస్ట్ చేసారని వివరిస్తున్నారు. ఇలా చంద్రబాబు జైలుకు వెళ్లిన నాటినుండి భువనేశ్వరి ప్రజల్లోనే వుంటూ పోరాటం చేస్తున్నారు.

తాజాగా చంద్రబాబు అరెస్ట్ తో మనస్తాపానికి గురయి మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు. కుటుంబసభ్యులను కోల్పోయి పుట్టెడు దు:ఖంలో వున్న కుటుంబాలను ఓదారుస్తున్నారు. బాధలో వున్న కుటుంబసభ్యులకు టిడిపి అండగా వుంటుందని భువనేశ్వరి ధైర్యం చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news