ఒకే ఒక్క అభ్యర్థితో బీజేపీ రెండో జాబితా విడుదల

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండో జాబితాను తాజాగా విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. శుక్రవారం విడుదల చేసిన ఈ జాబితాలో కేవలం ఒకే ఒక్క అభ్యర్థి పేరు మాత్రమే ఉండటం గమనార్హం. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ను ఏపీ మిథున్ రెడ్డికి కేటాయించింది బీజేపీ.

అక్టోబర్ 22న తెలంగాణ ఎన్నికలకు సంబంధించి 52 మందితో కూడి తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదలైంది. హూజూరాబాద్, గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తారని ప్రకటించింది. అదేవిధంగా కరీంనగర్ సెగ్మెంట్ నుంచి బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బరిలోకి దిగనున్నారు. పాతబస్తీలోని అన్ని స్థానాల నుంచి పోటీకి బీజేపీ సిద్ధం అయింది. తొలి జాబితాలో 12 మంది మహిళలకు అవకాశం కల్పించింది. ముగ్గురు ఎంపీలను బరిలోకి దింపింది. బీసీలు 16, ఎస్సీలు 08, ఎస్టీలు 06, ఓసీలు 10 మందికి స్థానాలను కేటాయించింది బీజేపీ. ఇంకా మిగిలి ఉన్న 66 స్థానాల్లో బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. జనసేన ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తుందనేది క్లారిటీ రావాల్సి ఉంది. బీజేపీ జనసేన పొత్తుల చర్చలు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news