శ్రీలంక టూర్ : టీ-20 మ్యాచ్‌లకు కెప్టెన్‌ గా భువనేశ్వర్‌ !

-

ప్రస్తుతం టీం ఇండియా… శ్రీలంక టూర్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ జట్టుపై వన్డే సిరీస్‌ ను గెలిచిన టీం ఇండియా… ఇప్పుడు టీ-20 కప్‌ పై కన్నేసింది. ఈ నేపథ్యంలోనే టీం ఇండియాకు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కృనాల్‌ పాండ్యాకు కరోనా సోకగా… తాజాగా… టీం ఇండియా కెప్టెన్‌ ను మార్చే పరిస్థితి నెలకొంది. ఇందులో భాగంగానే…శ్రీలంకతో జరిగే మిగిలిన రెండు టి-20 మ్యాచ్‌లలో భువనేశ్వర్ కుమార్ జట్టుకు కెప్టెన్ అయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

కృనాల్‌ పాండ్యా కోవిడ్ -19 పాజిటివ్‌గా గుర్తించడంతో… శ్రీలంక వర్సెస్ ఇండియా రెండో టీ20 మ్యాచ్ వాయిదా పడింది. అలాగే…ఇప్పుడు, భారత జట్టులో ఏకంగా 8 మంది ఆటగాళ్లు ఐసోలేషన్‌ కు వెళ్లారు. ఈ 8 మంది ఆటగాళ్ళు కృనాల్‌ పాండ్యాతో సన్నిహితంగా ఉన్న కారంణంగా ఐసోలేషన్‌ కు వెళ్లారు. శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా, మనీష్ పాండే, కృష్ణప్ప గౌతమ్, మరియు ఇషాన్ కిషన్ ఈ 8 మంది ఆటగాళ్ళలో ఉన్నారు. ఈ లిస్టులో శిఖర్ ధావన్ ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే టీం ఇండియా కెప్టెన్ గా భువనేశ్వర్ కుమార్‌ ను కెప్టెన్‌ గా నియమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news