సైకిల్ చోరీ: పోలీసుల భయంతో ఇద్దరి ఆత్మహత్య

-

సైకిల్ చోరీకి పాల్పడిన ఇద్దరు స్నేహితులు పోలీసు కే భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన వారిని సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజిగూడెం గ్రామానికి చెందిన చాకలి లక్ష్మయ్య(55), వెంకటేశ్(45)లుగా గుర్తించారు.

సంగారెడ్డి పోలీస్ ఇన్‌స్పెక్టర్ బి.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మయ్య, వెంకటేశ్ ఇద్దరూ కలిసి సైకిల్ చోరీకి పాల్పడ్డారు. ఆ సైకిల్‌ను తీసుకొని గ్రామానికి వెళ్లగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. దీంతో భయాందోళనకు గురైన ఇద్దరు గ్రామం నుంచి పరారై సంగారెడ్డి చేరుకున్నారు. పాత బస్టాండ్ ప్రాంతంలో మద్యం, పురుగుల మందు కలిపి తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సైకిల్ చోరీకి పాల్పడిన ఇద్దరు స్నేహితులు పోలీసు కేసు భయంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version