బిగ్ బాస్ 5 వేట… కంటెస్టంట్ లు వీళ్ళే ?

-

బిగ్ బాస్ సీజన్ 4 ముగిసిన కొద్ది రోజులకే బిగ్ బాస్ 5కి సంబందించిన చర్చలు కూడా మొదలయ్యాయి. దానికి తోడు మీరు బిగ్ బాస్ ని మిస్ అవుతున్నారా ? అని స్టార్ మా ఒక ఒపీనియన్ పోల్ కూడా పెట్టడంతో ఇప్పుడు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే ఈ సీజన్ కు ఇప్పటికే కొంత మందిని సెలెక్ట్ చేశారని అంటున్నారు. అది కూడా గత సీజన్ లా కాకుండా ఈ సీజన్ కోసం బాగా ఫేమస్ అయిన వారినే సెలెక్ట్ చేశారని అంటున్నారు.

అందులో ముఖ్యంగా ఐదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా యూట్యూబర్ షన్ముఖ్ జస్వంత్ ని సెలెక్ట్ చేశారని అంటున్నారు. ఈ లాక్ డౌన్ లో సాఫ్ట్ వేర్ డెవలపర్ సిరీస్ తో ఈయన జనానికి బాగా దగ్గరయ్యాడు. ఇక ఎప్పటిలాగే ఒక టేవీ9 యాంకర్ ని కూడా సెలక్ట్ చేశారట. ఆమె మరెవరో కాదు, ప్రత్యూష పెన్మత్స అని అంటున్నారు. అలానే టిక్ టాక్ లో సూపర్ ఫేం తెచ్చుకున్న శిరీషా నాయక్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.

 

ఈమె కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసిందని అంటున్నారు. ఇక మరోపక్క ర్యాపర్ గా సింగర్ గా పేరుతెచ్చుకున్న మేఘ్ రాజ్ కూడా ఈ సీజన్ లో పాల్గొననున్నారని అంటున్నారు. అంతే కాక పటాస్ లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న బల్వీర్ సింగ్ కూడా ఈ సీజన్ కోసం ఎంపిక అయ్యారని అంటున్నారు. అంతే కాక మొన్నటిలా కాకుండా ఈ ఏడాది షో వీలయినంత త్వరగా మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news