మరో బిగ్‌బాస్ జంట బ్రేకప్‌..

-

మరో బిగ్‌బాస్ జంట విడిపోయింది. బాలీవుడ్​ హీరోయిన్​ శిల్పా శెట్టి చెల్లెలు షమితా శెట్టి తన ప్రియుడు రాకేశ్‌ బాపత్‌కు బ్రేకప్ చెప్పేసింది. ప్రముఖ రియాల్టీ షో బిగ్‌బాస్‌ వేదికగా పరిచయమైన ఈ సెలబ్రిటీ జోడీ ఏడాదిలోనే తమ బంధానికి స్వస్తి పలికింది. తమ దారులు వేరని.. అందుకనుగుణంగానే తమ ప్రయాణం కొనసాగుతుందంటూ తాజాగా ప్రకటించింది. దీంతో వీరి అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు.

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి సోదరిగా ఇండస్ట్రీకి పరిచయమైన చిన్నది షమితాశెట్టి. అనుకున్న స్థాయిలో విజయాలను అందుకోలేకపోయిన ఆమె గతేడాది ‘బిగ్‌బాస్‌-ఓటీటీ’లో దర్శనమిచ్చారు. అక్కడే ఆమెకు నటుడు రాకేశ్‌ బాపత్‌తో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకే వీరు ప్రేమలో ఉన్నట్లు వెల్లడించారు. త్వరలోనే వీరి పెళ్లి ఉంటుందని అంతా భావించారు.

అయితే.. తాము పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామంటూ మంగళవారం ఈ జంట సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘‘’మా బంధంపై స్పష్టత ఇవ్వడం ఎంతో ముఖ్యంగా భావిస్తున్నా. రాకేశ్‌-నేనూ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. గతకొంతకాలంగా మేమిద్దరం కలిసి లేం. ఇంతకాలం మీరు మాపై చూపించిన ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. ఇకపైనా ఇదే విధంగా చూపిస్తారని అనుకుంటున్నా’’’ అని షమితా పోస్ట్‌ పెట్టారు. రాకేశ్‌ కూడా ఇదే విధంగా స్పందించారు. ఇక, తెలుగులో విడుదలైన ‘పిలిస్తే పలుకుతా’తో షమితా శెట్టి ఇక్కడివారికీ సుపరిచితురాలయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news