బిగ్ బ్రేకింగ్; లాక్ డౌన్ పెంపు, అన్ని రాష్ట్రాలు ఓకే…?

-

లాక్ డౌన్ ని పొడిగించే విషయంలో ఇప్పుడు తెలంగాణా బాటలో మరికొన్ని రాష్ట్రాలు నడుస్తున్నాయి. తెలంగాణాలో లాక్ డౌన్ ని కొనసాగించడానికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన తెలంగాణా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేసారు. లాక్ డౌన్ ని పొడిగిస్తే మంచిది అనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేసారు. అప్పుడే మన దేశంలో పరిస్థితులు అదుపులో ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు.

కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలు ఇప్పుడు మరికొన్ని వారల పాటు లాక్ డౌన్ ని కొనసాగించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్రంగా ఉన్నాయి. కేంద్ర మంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్ళు కూడా లాక్ డౌన్ ని పొడిగిస్తే మంచిది అనే అభిప్రాయం వ్యక్తం చేసారు.

మరికొన్ని వారాల పాటు లాక్ డౌన్ ని పొడిగిస్తే కరోనా కట్టడిలో ఉంటుందని ఇప్పుడు ఇబ్బంది పడకపోతే భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుందని వాళ్ళు చెప్పినట్టు సమాచారం. లాక్ డౌన్ ని కొనసాగించాలి అని ఇప్పటికే పలు వినతులు కూడా ఇప్పుడు కేంద్రానికి రాష్ట్రాలు పంపాయి. ఇప్పుడు దీనిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇదే విషయాన్ని కేంద్రానికి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news