కొండా సురేఖకు బిగ్ షాక్.. రేవంత్ కు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

-

ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సత్యాగ్రహ దీక్షకు కొండా సురేఖని ఇన్చార్జిగా నియమిస్తే ఆమెకు బదులుగా ఆమె కుమార్తె సుస్మిత హాజరు కావడంతో సుస్మిత ని అడ్డుకున్నారు ఇనుగాల వర్గీయులు. గత కొంతకాలంగా పరకాల నియోజకవర్గానికి కొండా సురేఖ దూరంగా ఉంటున్నారని, తాము వచ్చే ఎన్నికల్లో అక్కడ పోటీ చేయడం లేదని చెబుతూనే.. నియోజకవర్గంపై అజమాయిషీ చేస్తున్నారని కొండా సురేఖ పై ఫిర్యాదు చేయడానికి గాంధీభవన్ కి వచ్చారు పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు.

Konda Surekha

పరకాల నియోజకవర్గం నుండి గాంధీభవన్ కి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డి కి ఫిర్యాదు చేశారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కష్టంగా ఉన్న ఏ స్థానం నుంచి అయినా తాము ఎన్నికల బరిలోకి దిగడానికి రెడీగా ఉన్నామని కొండా మురళి గతంలోనే పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version