బ్రేకింగ్ : జగన్ ప్రకాశం పర్యటనలో బాలినేనికి చేదు అనుభవం

-

సీఎం వైఎస్‌ జగన్‌.. ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటనకు వెళ్లనున్నారు. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.

ఈ సందర్భంగా ఎస్‌వీకేపీ డిగ్రీ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభా వేదిక వద్ద వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేయనున్నారు వైఎస్‌ జగన్‌. అయితే.. సీఎం జగన్ పర్యటన లో మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. బాలినేని కి ప్రొటో కాల్ లో అధికారులు ప్రాధాన్యత ఇవ్వలేదు. అధికారులపై ఆగ్రహంతో ఈబిసి నేస్తం కార్యక్రమంలో పాల్గొన కుండా ఒంగోలు వెళ్ళిపోపోయారు బాలినేని శ్రీనివాసరెడ్డి. బాలినేనితో పాటు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, బాలినేని అనుచరులు వెనుకకు వెళ్లారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version