బీఆర్ఎస్ కి బిగ్ షాక్..కాంగ్రెస్ లో చేరిన మరో ఎమ్మెల్యే

-

ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు వరుసగా పార్టీని వీడుతుండటంతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది.గత వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హస్తం తీర్థం పుచ్చుకున్నారు.శనివారం జాయినింగ్ పై రేవంత్ రెడ్డితో చర్చలు జరిపి వెళ్లిపోయిన మహిపాల్ రెడ్డి.. ఇవాళ (సోమవారం) ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, పలువురు కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ గూటికి చేరారు.ఇప్పటి వరకు మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు.

ఇప్పటికే కాంగ్రెస్‌లో కడియం శ్రీహరి, ప్రకాశ్‌గౌడ్‌, కాలేరు యాదయ్య, దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావ్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ,సంజయ్‌, కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. మరికొందరు ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి పలువురు త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news