IPL auction : సురేష్ రైనాకు బిగ్ షాక్..అన్ సోల్డ్ ప్లేయర్ గా రైనా

-

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేయర్ సురేష్ రైనా కు బిగ్ షాక్ తగిలింది. ఇవాళ జరిగిన ఐపీఎల్ 2022 మెగా వేలంలో సురేష్ రైనాకు నిరాశ మిగిలింది. గత ఏడాది వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన సురేష్ రైనా ఈసారి… రెండు కోట్ల రూపాయలతో వేలంలో పాల్గొన్నాడు.

అయితే ఈ వేలం లో… సురేష్ రైనాను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో సురేష్ రైనా కు ఊహించని షాక్ తగిలింది. ఐపీఎల్ 2022 వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్ గా సురేష్ రైనా మిగిలిపోయాడు. సురేష్ రైనా తో పాటు ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను కూడా కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. ఇది ఇలా ఉండగా సురేష్ రైనా ఇంట ఇటీవల విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. క్యాన్సర్ వ్యాధి తో సురేష్ రైనా తండ్రి మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news