బిగ్ బాస్: ఆ విషయంలో ఇనయాకు షాక్.. డేంజర్ జోన్ లో వారే..!

-

ప్రస్తుతం బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. ఈ ఆరవ సీజన్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో.. ఎవరు బిగ్బాస్ టైటిల్ విన్నర్ అవుతారో అనేది తెలియక చాలామంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో.. ఈ వారానికి సంబంధించి టాస్క్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచిన శ్రీహాన్ తప్ప హౌస్ లో ఉన్న వాళ్ళందరూ అంటే రేవంత్, కీర్తి భట్, ఆదిరెడ్డి, శ్రీ సత్య, రోహిత్, ఇనయా సుల్తానా నామినేషన్ లో ఉన్నారు. గతంలో కంటే బిగ్ బాస్ ఆరో సీజన్ లో షాకింగ్ ఎలిమినేషన్స్ సాగుతున్నాయి. ఇప్పుడు ఇది చివరి దశకు చేరుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా తమకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓటు వేయడానికి పోటీ పడుతున్నారు.

ఇకపోతే బిగ్ బాస్ ఆరో సీజన్ లో చాలామంది సెలబ్రిటీలు కంటెస్టెంట్ లుగా వచ్చారు. కానీ అందులో సింగర్ రేవంత్ మాత్రమే టైటిల్ ఫేవరెట్ అనిపించుకుంటున్నాడు. అందుకే 14వ వారం కూడా రేవంత్ కి ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నట్లుగా తెలిసింది. అతడి తర్వాత మాత్రం ఇనయా సుల్తానా ఉంటుందని అనుకున్నా.. ఆమెకు ప్రేక్షకులు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 14వ వారానికి సంబంధించి జరుగుతున్న ఓటింగులో ప్రస్తుతానికి సింగర్ రేవంత్ మొదటి స్థానంలోనే ఉండగా.. అతని తర్వాత స్థానం రెండవ స్థానంలో రోహిత్.. మూడవ స్థానంలో ఆదిరెడ్డి.. నాలుగో స్థానంలో ఇనయా సుల్తానా ఉన్నారని సమాచారం.

ఇది ఓటింగుకు తొలిరోజే కాబట్టి ఈ స్థానాల్లో మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఐదవ స్థానంలో కీర్తి భట్, ఆరవ స్థానంలో శ్రీ సత్య ఉన్నట్లు సమాచారం. మొత్తానికి ఇదే ఓట్లు కొనసాగితే డేంజర్ జోన్ లో కీర్తి భట్, శ్రీ సత్య వున్నట్లే..మరి వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news