బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

-

ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. నిందితుల నుండి 50 లక్షల విలువైన 46 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.శంషాబాద్ ఎస్ఓటి, శంషాబాద్ జోన్ పోలీసులు కలిసి బైక్ అఫెండర్స్ ను పట్టుకున్నారని తెలిపారు. ఆరుగురు సభ్యులు గల ఈ ముఠా..పది నెలల నుంచి హైదరాబాద్ సైబరాబాద్, రాచకొండ లో బైక్ ల దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు.

ఇందులో 44 కేసులు డిటెక్ట్ అయినవనీ అన్నారు.ఈ ముఠా లో ఇద్దరు జువైనల్స్ ఉన్నారనీ తెలిపారు.ప్రధాన నిందితుడు A 1 మహమ్మద్ అష్వాక్ అలియాస్ (ఖబీర్) పాతబస్తీ కీ చెందిన వ్యక్తి గా గుర్తించారు.మదీన సెంటర్ లో సెల్స్ మేన్ గా పనిచేసేవాడనీ తెలిపారు.సద్దాం అనే స్నేహితునితో కలిసి ఫస్ట్ హైదరాబాద్ లో బైకులు దొంగతనం చేశారనీ..మరో నలుగురు ని కలుపుకుని మూడు కమీషనరేట్ ల పరిదిలో వరుసగా టూ వీలర్ లు చోరీ చేసేవారనీ తెలిపారు.

ఇద్దరు జువైనల్స్ ను కూడా గ్యాంగ్ లో చేర్చుకున్నారనీ అన్నారు.జీతం సరిపోక విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చోరీలు చేశారనీ తెలిపారు. ఇలా చోరీ చేసిన వాహనాలను వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి లలో అమ్మేవారనీ తెలిపారు.ఫైనాన్స్ కట్ఠని బైకులు అని చెప్పి అమ్మేవారనీ,15 వేల నుంచి 30 వేల వరకు ఈ బైకులను అమ్మేవారనీ అన్నారు.షాపింగ్ మాల్స్ లో, షాపుల ముందు లాక్ చేయకుండా ఉన్న బైకులను టార్గెట్గా చేసుకొని ఈ చోరీలకు పాల్పడ్డట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version