ఏపీలో తెరకెక్కనున్న వైసీపీ ఎంపీ నందిగం సురేష్ జీవిత చరిత్ర

-

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకుల జీవితాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే కొండా పేరుతో కొండా సురేఖ జీవితాన్ని ఆర్జీవీ బయోపిక్ తీస్తున్నారు. ఏపీలో వైసీపీ బాపట్ల ఎమ్పీ నందిగం సురేష్ జీవిత చరిత్ర తెరకు ఎక్కనుంది. జగన్ అభిమాని పేరుతో బయోపిక్ తీస్తున్నారు. ఇక తాజాగా పోస్టర్ విడుదల చేయనున్నారు వైసీపీ పార్టీ నేతలు. లోకల్ ఫోటో గ్రాఫర్ గా జీవితం ప్రారంభించారు నందిగం సురేష్. గత ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ అంశాల్లో పోరాడిన నందిగం సురేష్…వైసీపీలో అనూహ్యంగా గత ఎన్నికల్లో ఎమ్పీగా గెలిచారు.

ఈ సందర్భంగా నందిగం సురేష్ మాట్లాడుతూ…నేనొక సామాన్యుడిని అలాంటిది జగన్ మోహన్ రెడ్డి నన్ను ఎంపిని చేశారు.ఇది దళితులకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా అని పేర్కొన్నారు. ప్రజల కోరిక మేరకు నా జీవిత చరిత్రను బాపట్ల ఎంపి టైటిల్, క్యాప్షన్ నందిగం సురేష్ పేరుతో సినిమా నిర్మిస్తున్నాం…నెల రోజుల్లో సినిమా రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు. టిడిపి చేసిన అకృత్యాలు వైసిపి అమలు చేసిన సంక్షేమ పథకాల పై సినిమా కథ ఉంటుంది.అమరావతి విషయంలో చంద్రబాబు దళితులకు చేసిన అన్యాయం పై సినిమా నిర్మాణం జరిగింది.నా లాంటి సామాన్యులకు జగన్ అండగా నిలుస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news