తెలంగాణలో బీజేపీ దూకుడు..ఉమ్మడి జిల్లాల ఇంఛార్జీల నియామకం

-

తెలంగాణలో బీజేపీ పార్టీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. తెలంగాణ లో ఎలాగైన అధికారంలోకి రావాలని బీజేపీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఉమ్మడి జిల్లాల ఇంఛార్జీలను నియామకం చేసింది బీజేపీ అగ్ర నాయకత్వం. ఇందులో భాగంగానే.. హైదరాబాద్ ఇంఛార్జీ గా కొండ విశ్వేశ్వర్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి ఇంఛార్జీ గా ప్రెమెందర్ రెడ్డిను నియమించింది.

మెదక్ ఇంఛార్జీ గా జితేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ ఇంఛార్జీ గా ప్రదీప్ కుమార్, నిజామాబాద్ ఇంఛార్జీ గా బూర నర్సయ్య గౌడ్, అదిలాబాద్ ఇంఛార్జీ గా మర్రి శశధర్ రెడ్డి, కరీం నగర్ ఇంఛార్జీ గా చా డ సురేష్ రెడ్డి నియామకం అయ్యారు. వరంగల్ ఇంఛార్జీ గా వివేక్ వెంకట స్వామి, నల్గొండ ఇంఛార్జీ గా బంగారు శ్రుతి నియామకం అయ్యారు. ఖమ్మం ఇంఛార్జీ గా గరికపాటిని నియామకం చేసింది బీజేపీ అగ్ర నాయకత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version