వందల కోట్లు దోచేయడానికి ఏపీ సీఎం సిద్ధం: BJP

-

ఏపీలో విపక్షాలన్నీ అధికార పార్టీ మీద దృష్టిని సారిస్తున్నాయి. వైసిపి అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వలాభం కోసం పార్టీ ప్రచారానికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విపక్ష పార్టీలన్నీ ధ్వజమెత్తుతున్నాయి. ఇటీవల ఇదే అంశంపై హైకోర్టు సీఎం జగన్ కి మొట్టికాయలు వేసింది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీ కూడా జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రజాధనంతో దుష్ప్రచారమే వైసిపి లక్ష్యం వందల కోట్లు దోచేందుకు జగన్ సిద్ధమని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. వీడియోలో జగన్ 810 కోట్ల ప్రజాధనంతో సొంత పబ్లిసిటీ చేసుకుంటున్నారని అన్నారు ప్రచారం పిచ్చితో 621 కోట్లు కావాలని ప్రతిపాదనలు వస్తున్నాయని వెల్లడించింది ఇలా వైసిపి ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version