ఎమ్మెల్సీ ఎన్నికలపై సీరియస్ గా బిజెపి… తెలంగాణాకు కేంద్ర మంత్రులు

-

ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారతీయ జనతా పార్టీ… తెలంగాణాలో కేంద్ర మంత్రులను రంగంలోకి దించుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి .. సాగర్ ఉప ఎన్నికపై గురి పెట్టాలని ఆ పార్టీ భావిస్తుంది. పట్టభద్రులే లక్ష్యంగా ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారాన్ని హోరెత్తించాలని నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి కేంద్రమంత్రులను దింపుతుంది. గ్రేటర్ ఎన్నికల మాదిరి.. కేంద్రమంత్రులతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయిస్తుంది.

గ్రాడ్యుయేట్లతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో పట్టభద్రులకు వివరించనున్న కేంద్రమంత్రులు… పట్టభద్రులు, నిరుద్యోగుల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత కలసి వస్తుందని భావిస్తున్నారు. నేడు హైదరాబాద్ కు కేంద్రమంత్రి ప్రకాష్ జావడేకర్ వస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభిస్తారు. సాయంత్రం 5గంటలకు హోటల్ మారియట్ లో గ్రాడ్యుయేట్స్ తో సమావేశం అవుతారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఐవైఆర్ కృష్ణారావు తదితరులు హాజరు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news