బిజెపి నాయకులు మిడతల్లాగా వచ్చి తెలంగాణ పై దాడి చేస్తున్నారు – మంత్రి జగదీష్ రెడ్డి

-

బిజెపి నాయకులు మిడతల్లాగా వచ్చి తెలంగాణ పై దాడి చేస్తున్నారని మండిపడ్డారు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి. మర్రిగూడెం, గట్టుపల్ మండల కేంద్రాలలో టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బిజెపి నాయకులు కేసీఆర్ పేరు వింటేనే బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. మునుగోడులో గులాబీ పార్టీ కార్యకర్తలు సైనికుల రాగా పనిచేస్తున్నారని.. బిజెపి కుట్రలను ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

మునుగోడు లో గెలిచేది టిఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో మునుగోడులో కరువు తాండవించిందని ఆరోపించారు. ఫ్లోరైడ్ భూతంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతే మునుగోడు దశ దిశ తిరిగిందని.. ఫ్లోరైడ్ అంతం అయిందన్నారు. ఇతర రాష్ట్రాల ప్రజల సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version