దేశంలో మజ్లీస్, వైసీపీలు అతిపెద్ద మతతత్వ పార్టీలు – విషువర్ధన్ రెడ్డి

-

దేశంలో మజ్లీస్, వైసీపీలు అతిపెద్ద మతతత్వ పార్టీలు అని ఫైర్‌ అయ్యారు ఏపీ రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి విషువర్ధన్ రెడ్డి. వైసీపీ మంత్రులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో రాష్ట్ర ప్రజలకు అర్ధమైందని.. నడ్డా పర్యటన తరువాత వైసీపీ నిజ స్వరూపం బయట పడిందన్నారు. ఏపీలో ఇసుక, భూ, మధ్యం, మైనింగ్ మాఫియా జరుగుతుందన్న నడ్డా ఆరోపణలు నిజం కాదా… దేశంలోనే మద్యం ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు.

మూడేళ్లలో ఏపీ అభివృద్ధి చెందలేదు… వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోయిందని… కేంద్రం ఇచ్చిన నిధులు వాడుకొని లబ్ధిదారులకు ఒక్క ఇల్లు ఇవ్వలేదని ఆగ్రహించారు. జగన్ అన్న కాలనీలో ఎక్కడ ఇండ్లు కట్టారో వైసీపీ నేతలు చెప్పాలని..కేంద్రం రాష్ట్రానికి ఏమీ ఇచ్చిందని ప్రశ్నిస్తున్నారు… ఎయిమ్స్ ఎక్కడి నుంచి వచ్చిందన్నారు. ఐఐటీ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్, జాతీయ రహదారులు కేంద్రం ఇచ్చింది కనపడటం లేదా అని నిలదీశారు. ఏపీలో జాతీయ రహదారులు తప్పితే రాష్ట్ర రహదారులు లేవని.. జేపి. నడ్డాపై వ్యక్తిగత దూషణలు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version