కర్ణాటక సీఎంపై పోస్ట్ పెట్టిన బీజేపీ లీడర్ అరెస్ట్ !

-

కర్నటక రాష్ట్రానికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన సిద్దరామయ్య సీఎంగా ఉన్నారు. ఈ మధ్యనే జరిగిన ఎన్నికల్లో కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పై విశ్వాసాన్ని ఉంచి భారీ మెజారిటీతో గెలిపించారు. అయితే బీజేపీ ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై అవకాశం వస్తే చాలు విమర్శిస్తూ వస్తోంది. అదే విధంగా తాజాగా ఒక ఘటనపై బీజేపీ కార్యకర్త ఒకరు సీఎం పై పోస్ట్ పెట్టినందుకు, ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు ఉడిపి కేసును బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని కామెంట్ చేశాడు. కాగా ఈ కామెంట్ కు బీజేపీ కార్యకర్త శకుంతల పోస్ట్ ను షేర్ చేస్తూ ఇదే సంఘటన సిద్దరామయ్య కోడలికో లేదా భార్యకు జరిగి ఉంటే ఇదే విధంగా మాట్లాడుతారా ? అంటూ ప్రశ్నించడంతో దీనిపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు కారణంగా ఆమెను వెంటనే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.

 

కొన్ని కొన్ని సార్లు ఈజీగా చేసే కొన్ని పోస్టింగ్ లు మనలను చాలా ఇబ్బందులకు గురి చేస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news