పండగ పూట విషాదం : బాయిలర్ పేలి ఇద్దరు మృతి !

-

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ సర్పవరం టైకీ ఇండస్ట్రీలో బాయిలర్ పేలిన సంఘటనలో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ రూరల్ టైకి కెమికల్ ఇండస్ట్రీస్ లో ఎయిర్ గ్యాస్ లీక్ కావడంతో బిల్డింగ్ పైన చుట్టుపక్కల ఉన్న గోడ పగిలి రోడ్డుపై చెల్లాచెదురైంది. మెడికల్ పౌడర్ తయారు చేసే ఈ కంపెనీలో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులు సైతం గాయాల పాలయ్యారు..

క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు.. గ్యాస్ లీకేజీ కావడంతో చుట్టుపక్కల ఉన్న సర్పవరం గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ..గతంలో  కూడా గ్యాస్  లీక్ అయింది అని చెబుతున్నారు. ఇటువంటి కెమికల్ ఫ్యాక్టరీలు సర్పవరం గ్రామ సమీపంలో పెట్టి మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని గతంలో స్థానికులు ఆందోళనకు కూడా దిగారు. అయినా ప్రభుత్వ వర్గాల నుంచి అయితే ఎలాంటి స్పందనా లేదు.

Read more RELATED
Recommended to you

Latest news