మేడారంకు వెళ్లిన బొలెరో వాహనం బోల్తా..20 మంది భక్తులు ?

-

మేడారంకు వెళ్లిన బొలెరో వాహనం బోల్తా కొట్టడంతో.. 20 మంది భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా… మేడారం అమ్మవార్లను దర్శించుకునీ వస్తుండగా రాత్రి 8 గంటల సమయంలో బొలెరో వాహనం బోల్తా కొట్టి ప్రమాదం చోటు చేసుకుంది. ఏటూరునాగారం (మం) చిన్నబోయినపల్లి, తాడ్వాయి మధ్యలో ఎదురుగా వస్తున్న ఇసుక లారినీ తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది బొలెరో ట్రాలీ వాహనం.

Bolero vehicle going to Medaram overturned

ఇక ఈ బొలెరో వాహనంలో 20 మంది భక్తులు ఉన్నారు. ఈ ప్రమాదంలో చదలవాడ రమణ (50) మృతి చెందగా, మరో 13 మంది ప్రయాణికులకు తీవ్రగాయలు అయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హుటహుటీన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు మంగపేట (మం) రమనక్కపేట గ్రామస్తులుగా గుర్తించారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version