బాలీవుడ్ యాక్టర్ జెత్వానీ కేసు.. విజయవాడ కోర్టుకు విద్యాసాగర్

-

బాలీవుడ్ యాక్టర్ జెత్వానీ కేసులో వైసీపీ నేత విద్యాసాగర్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో తమ కుటుంబం పై అక్రమంగా కేసులు బనాయించి వేధించారని విద్యాసాగర్‌తో పాటు పలువురు ఐపీఎస్ పోలీసు అధికారులపై ముంబై నటి జెత్వానీ విజయవాడలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే కేసు నమోదు చేసి పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

అయితే, ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రధాన నిందితుడు విద్యాసాగర్‌ను పోలీసులు డెహ్రాడూన్‌లో అరెస్ట్ చేశారు. బాలీవుడ్ నటి జెత్వానీని వేధించిన కేసులో అరెస్టయిన కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు శనివారం విజయవాడ కోర్టులో హాజరుపరచనున్నారు.నిన్న డెహ్రాడూన్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు ముందుగా అక్కడి కోర్టులో హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై నేడు విజయవాడకు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచనున్నారు. నిందితుడిపై నమోదైన అభియోగాల ద్వారా అతనికి కఠిన విధించాలని జెత్వానీ డిమాండ్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news